Chittoor District: పూతలపట్టులో రిగ్గింగ్ ఆరోపణలు.. వైసీపీ అభ్యర్థిపై దాడి, తీవ్రగాయాలు!

  • పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు
  • అతని కుమారుడిపైనా దాడి
  • చిత్తూరు ఆసుపత్రికి తరలింపు

చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి జరిగింది. ఈ దాడిలో బాబుతో పాటు అతని కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాబు వాహనం ధ్వంసమైంది. ఓ మీడియా వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్టు సమాచారం. పూతలపట్టులో టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఐరాడ మండలంలోని కట్టకిందపల్లె బూత్ కు బాబు వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అక్కడ ఉన్న ఓ ఈవీఎంను బాబు ధ్వంసం చేశారని, దీంతో, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో బాబు స్పృహ తప్పి పడిపోవడంతో ప్రాథమిక చికిత్స నిమిత్తం ఐరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లినట్టు సమాచారం. 

More Telugu News