Kurnool District: రోడ్డుపైనే భూమా కుటుంబ సభ్యుల ఆందోళన

  • మా అనుచరులను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారు
  • భూమా కుటుంబసభ్యుల ఆరోపణ
  • ఆళ్లగడ్డలో రోడ్డుపై వాహనాలు నిలిపి నిరసన

తమ అనుచరులను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని భూమా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆళ్లగడ్డలో రోడ్డుపై వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నేత అఖిలప్రియ సోదరి భూమా నాగమౌనిక కారు అద్దాలను ధ్వంసం చేయడంపైనా భూమా వర్గీయులు మండిపడుతున్నారు. వైసీపీ నేత గంగుల వర్గీయులే ఈ ఘటనకు పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News