surya: 'ఎన్జీకే' నుంచి మసాలా సాంగ్ వచ్చేస్తోంది

  • విభిన్నకథా చిత్రంగా 'ఎన్జీకే'
  • ఈ నెల 12న మసాలా సాంగ్ 
  • మే 31న సినిమా విడుదల

సూర్య కథానాయకుడిగా .. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే' రూపొందింది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాలో రకుల్ .. సాయిపల్లవి కథానాయికలుగా కనిపించనున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో మే 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు భాషల్లోను మసాలా సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.

ఈ నెల 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు మసాలా సాంగ్ ను విడుదల చేయనున్నారు. 'వడ్డీలోడు వచ్చేనే .. ' అంటూ ఈ పాట సాగనుంది. ఎస్.ఆర్.ప్రభు నిర్మించిన ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఒక వైపున ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరో వైఫున మరో రెండు ప్రాజెక్టులను సూర్య పట్టాలెక్కించడం విశేషం. 

More Telugu News