YVS Chowdary: కోర్టు తీర్పు అనంతరం మోహన్‌బాబు ఇబ్బందులకు గురి చేస్తున్నారు: లీగల్ నోటీసు పంపించిన వైవీఎస్ చౌదరి

  • చెక్ బౌన్స్ కేసులో ఇటీవల తీర్పిచ్చిన కోర్టు
  • నా స్థలంలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారు
  • శాశ్వత పరిష్కారం కోసం న్యాయ నిపుణులను సంప్రదించా

‘సలీం’ చిత్ర సమయంలో ప్రముఖ నటుడు మోహన్‌బాబు తనకిచ్చిన చెక్ బౌన్స్ అయిందని వైవీఎస్ చౌదరి కేసు వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల కోర్టు తీర్పును కూడా ప్రకటించింది. ఈ తీర్పు అనంతరం మోహన్‌‌బాబు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైవీఎస్ చౌదరి ఆరోపిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ విషయమై మోహన్‌బాబుకు లీగల్ నోటీసులు పంపించారు.

‘సలీం’ సినిమా సమయంలో తాను జల్‌పల్లి గ్రామంలో మోహన్‌బాబు నివసిస్తున్న ఇంటిని ఆనుకుని ఉన్న అర ఎకరం స్థలాన్ని కొన్నానని, కోర్టు తీర్పు అనంతరం తనను ఆ స్థలంలోకి రానీయకుండా మోహన్‌బాబు, ఆయన మనుషులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కష్టార్జితంతో కొనుక్కున్న ఇంటి స్థలం విషయంలో సమస్యలు సృష్టించడం తనకు ఇబ్బందికరంగా ఉందని, అందుకే శాశ్వత పరిష్కారం కోసం న్యాయ నిపుణులను సంప్రదించినట్టు తెలిపారు. ఈ మేరకు మోహన్‌బాబుకు లీగల్ నోటీసు పంపించినట్టు వైవీఎస్ చౌదరి తెలిపారు.

  • Loading...

More Telugu News