Amanchi: చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచిపై కేసు నమోదు

  • కార్యకర్తలతో సమావేశం
  • అనుమతి లేదన్న పోలీసులు
  • ఈసీకి ఫిర్యాదు చేస్తానన్న ఆమంచి

ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ పై కేసు నమోదైంది. ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో ఆమంచి వేటపాలం మండలం పందిళ్లపల్లిలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. అయితే, పోలీసులు సమావేశానికి అనుమతి లేదంటూ అభ్యంతరం చెప్పడంతో ఆమంచి ఉగ్రరూపం దాల్చారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

దాంతో, పోలీసులు తమ విధులకు ఆమంచి ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. దీనిపై ఆమంచి మాట్లాడుతూ, తాను బూత్ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశానని, కానీ పోలీసులు అభ్యంతరం చెబుతున్నారని ఆరోపించారు. పోలీసులు అనవసరంగా కేసు నమోదు చేశారని అన్నారు. దీనిపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News