టీఆర్ఎస్ ప్రచారానికి అద్భుతమైన స్పందన వస్తోంది.. కాంగ్రెస్, బీజేపీలు కనీస పోటీ ఇవ్వలేవు!: మంత్రి శ్రీనివాసగౌడ్
- కేసీఆర్ పథకాలను ప్రజలు ఆదరించారు
- ఈసారి 16 లోక్ సభ సీట్లు గ్యారెంటీ
- మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆదరించారని గుర్తుచేశారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 16 స్థానాలను దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు గత ఎన్నికల్లో ఓడిపోయినవారిని, ఇతర ప్రాంతాలవారిని పోటీకి దించాయనీ, వాళ్లందరికీ ఈసారి కూడా ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు.