నారాయణగూడ చౌరస్తాలో రూ.8 కోట్ల నగదు పట్టివేత

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల సమయంలో నగదు రవాణాపై అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల రసీదుల్లేని నగదును పట్టుకున్న అధికారులు హైదరాబాదులో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే నారాయణగూడ ఏరియాలో ఓ కారులో తరలిస్తున్న రూ.8 కోట్ల రూపాయలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో శంకర్, ప్రదీప్ రెడ్డి, నందిరాజు గోపి, బ్రహ్మం, ఇందుశేఖర్, చలపతిరాజు, సుకుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ నగదును ఇండియన్ బ్యాంక్ నుంచి డ్రా చేసినట్టు గుర్తించారు.
Go Back to Shorts
Hyderabad

More Telugu News