allu arjun: అల్లు అర్జున్ .. సుకుమార్ మూవీలో రష్మిక

  • త్రివిక్రమ్ తో తాజా చిత్రం
  •  తదుపరి సినిమా సుకుమార్ తో
  •  ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగు  

ప్రస్తుతం అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కథపైనే సుకుమార్ కసరత్తు చేస్తున్నాడు.

ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అయితే బాగుంటుందనే ఉద్దేశంతో సుకుమార్ ఆమెను సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాతో ఆమె దశ తిరిగిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో మొదలుకానుంది. అటు త్రివిక్రమ్ తోను .. ఇటు సుకుమార్ తోను అల్లు అర్జున్ చేసేది మూడో సినిమా కావడం విశేషం. ఈ ఇద్దరితో కలిసి ఒకేసారి ఆయన హ్యాట్రిక్ హిట్స్ కొడతాడేమో చూడాలి మరి.

More Telugu News