Jagan: జగన్‌ గారూ.. రాజ్‌దీప్‌తో రాజధానిలో ఒక్క ఇటుక కూడా లేదన్నారుగా.. ఇది చూడండి: శివాజీ

  • అద్భుతంగా సాగుతున్న రాజధాని నిర్మాణాన్ని చూపించిన శివాజీ
  • సిద్ధమైన అధికారుల నివాస భవనాలు
  • అబద్ధాలను పదేపదే ప్రచారం చేసినా ప్రజలు నమ్మబోరని జగన్‌కు హితవు

పోలవరం టీవీ ప్రజెంటేషన్ తర్వాత నటుడు శివాజీ అమరావతిలో తాను పర్యటించిన వీడియోను ప్రదర్శించారు. గతంలో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో జగన్ మాట్లాడుతూ.. ఈ నాలుగేళ్లలో ఏపీ రాజధాని అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని పేర్కొన్న విషయాన్ని ఈ వీడియోలో చూపించారు. ఆ తర్వాత రాజధానిలో ప్లాస్టింగ్ కూడా అయిపోయిన ఎనిమిది టవర్లను చూపించి ఇప్పుడేమంటారు జగన్ గారూ? అని ప్రశ్నించారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా నివాసాలు ఉంటాయని ఎద్దేవా చేశారు.

ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నివాసం కల్పించే భవన సముదాయాలను చూపించిన శివాజీ వాటికి రంగులు కూడా వేసి సిద్ధం చేస్తున్న దృశ్యాన్ని చూపించారు. జగన్ అధికారంలోకి వస్తే అద్భుతమైన ఈ రాజధానిని తరలిస్తామని చెబుతున్నారని, ఎవడబ్బ సొమ్మని తరలిస్తారని ఘాటుగా ప్రశ్నించారు. అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకోవడం భ్రమేనని శివాజీ తేల్చి చెప్పారు.

More Telugu News