Anil chandra punetha: ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సెలవుల ప్రకటన

  • సెలవులపై అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు
  • ఏప్రిల్ 11 సెలవుగా ప్రకటన
  • 10, మే 23 స్థానిక సెలవులుగా వెల్లడి

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నేడు ఎన్నికల సెలవులపై ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ జరిగే రోజైన ఈ నెల 11ను సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పోలింగ్‌కు ముందు రోజు అంటే ఈ నెల 10తో పాటు, ఓట్ల లెక్కింపు జరిగే మే 23న స్థానిక సెలవులుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News