kesavireddy: ‘కేశవరెడ్డి’ బాధితులకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదు: వైఎస్ జగన్

  • మేము అధికారంలోకొస్తే న్యాయం చేస్తాం
  • ‘కేశవరెడ్డి’ విద్యా సంస్థల ఆస్తులను అమ్ముతాం
  • మోసం చేయడం చంద్ర బాబుకు అలవాటే

కేశవరెడ్డి విద్యా సంస్థల బాధితులకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదని, వైసీపీ ప్రభుత్వం వస్తే ఆ బాధితులను ఆదుకుంటామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేశవరెడ్డి విద్యా సంస్థల ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేస్తానని అన్నారు. ఉపఎన్నికలో టీడీపీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని, ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ మాటే మర్చిపోయారని అన్నారు. మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైపోయిందని విమర్శించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని, ప్రతి గ్రామానికి మూటలమూటలు డబ్బులు పంపి ఓటర్లను కొనుగోలు చేయాలని బాబు చూస్తున్నారని ఆరోపించారు.

More Telugu News