sobhita dhulipalla: 'కాంచన' హిందీ రీమేక్ లో తను చేయడం లేదట

  • హిందీలోకి 'కాంచన' రీమేక్ 
  • అక్షయ్ జోడీగా కైరా అద్వాని 
  • క్లారిటీ ఇచ్చిన శోభిత ధూళిపాళ

తెలుగు .. తమిళ భాషల్లో లారెన్స్ ప్రధాన పాత్రను పోషించిన 'కాంచన' భారీ విజయాన్ని సాధించింది. ఈ హారర్ థ్రిల్లర్ ఈ రెండు భాషల్లోను భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమాను 'లక్ష్మీ' పేరుతో హిందీలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమైంది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా .. కైరా అద్వాని కథానాయికగా ఈ సినిమాలో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమాలో శోభిత ధూళిపాళ చేయనుందనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో అవకాశం లభించినందుకు గాను ఆమెను అభినందిస్తూ సన్నిహితులు కాల్స్ చేయడం .. మెస్సేజ్ లు పెట్టడం చేస్తున్నారట. గూగుల్లో వచ్చిన వార్తలే అందుకు కారణమని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయిందట. ఆ తరువాత .. ఆ సినిమాకి సంబంధించిన వాళ్లెవరూ తనని సంప్రదించలేదనీ .. తాను ఈ సినిమా చేయడం లేదని చెప్పుకుంటూ వస్తోందట. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు హిందీలోను ఒకటి రెండు సినిమాలు చేస్తోంది. 

More Telugu News