chaitu: 'మజిలీ' కోసం ఒక్క నైజామ్ లోనే 200 థియేటర్లు

  • మరో ప్రేమకథా చిత్రంగా 'మజిలీ'
  • కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ పరిచయం
  • కలిసి రానున్న విడుదల సమయం

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య .. సమంత జంటగా 'మజిలీ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా, రేపే ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా కోసం 200 థియేటర్లను కేటాయించినట్టుగా తెలుస్తోంది.

పెళ్లి తరువాత చైతూ .. సమంత కలిసి చేసే మొదటి సినిమా కావడం .. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడం .. 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ శనివారం సెలవు రోజు కావడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలని చెబుతున్నారు. ఈ సినిమాలో మరో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ నటించిన సంగతి తెలిసిందే. ఈ అమ్మాయి గ్లామర్ .. గోపీసుందర్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. ఇక ఇదే బ్యానర్లో దర్శకుడు శివ నిర్వాణ మరో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తుండటం విశేషం.

More Telugu News