Congress: ఆగని వలసలు... బీజేపీలో చేరనున్న కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఆనందభాస్కర్‌

  • ఇటీవలే హస్తం పార్టీకి రాజీనామా
  • పార్టీ నాయకత్వంపై గత కొంతకాలంగా అసంతృప్తి
  • తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన

తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి నిష్క్రమించిన సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్‌ కమల దళంలో చేరాలని నిర్ణయించుకున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భాస్కర్‌ ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర నాయకత్వం తనపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అధిష్ఠానం పెద్దలు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోకుండా అవమానిస్తున్నారని మధనపడుతున్న ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోగా ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు.

  • Loading...

More Telugu News