Vijayasaireddy: అప్పుడో డ్రామా, ఇప్పుడో డ్రామా: విజయసాయిరెడ్డి

  • ఆడపిల్ల పెళ్లికి గతంలో రూ. 5 లక్షలు ఇస్తామన్నారు
  • ఇప్పుడేమో లక్ష ఇస్తామంటున్నారు
  • ఈ ఐదేళ్లూ ఎందుకు ఇవ్వలేదన్న విజయసాయి

చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరలేపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆడపిల్ల పెళ్లికి రూ. 5 లక్షలు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "గతంలో ఆడపిల్ల పుడితే బ్యాంకులో రూ. 5 వేలు డిపాజిట్ చేస్తాం. పెళ్లి నాటికి 5 లక్షలు ఇస్తాం అని చెప్పి మోసం చేశారు. ఇప్పుడేమో ఆడపిల్ల మ్యారేజికి లక్ష ఇస్తాం అని డ్రామా ఆడుతున్నారు. ఈ ఐదేళ్లు ఎందుకివ్వలేక పోయారు చంద్రబాబూ? కపటం, కుతంత్రాలకు పర్యాయ పదంగా మారారు" అని ట్వీట్ చేశారు.

More Telugu News