Jagan: అవుతాడమ్మా... అవుతాడు... యడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతాడు: వైఎస్ షర్మిల

  • 'జగన్ సీఎం..' అని కార్యకర్తల నినాదాలు
  • తన వ్యాఖ్యలతో వారిలో ఉత్సాహం నింపిన షర్మిల
  • చంద్రబాబును ఓడించాలని పిలుపు

ఈ ఉదయం పామర్రు నియోజకవర్గ పరిధిలోని వీరంకి లాకులో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా, పార్టీ కార్యకర్తలు, అభిమానులు "జగన్ సీఎం... సీఎం" అని నినాదాలతో హోరెత్తిస్తుంటే, షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అవుతాడమ్మా అవుతాడు. యడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. రాజశేఖరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నది ఐదు సంవత్సరాలు మాత్రమే. ఆ ఐదేళ్లలోనే రాష్ట్రం ఎప్పుడూ చూడని అభివృద్ధి చూసింది. ఎప్పుడూ చూడని సంక్షేమం చూసింది.

మన, పర తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, అది ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమేనని గర్వంగా చెప్పుకోగలం. కానీ, ఇప్పుడూ ఉన్నాడో ముఖ్యమంత్రి. చంద్రబాబు గారు... ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో ఐదేళ్లల్లోనే చూపించేశాడు. అవునా...? రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చారు. అదే మొదటి సంతకమన్నారు. దిక్కుందా? ఒక్క రైతుకు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదు" అని అన్నారు.

డ్వాక్రా మహిళలను ఇదే తరహాలో మోసం చేశారని, 'పసుపు - కుంకుమ' పథకం మరో మోసపు కుట్రని విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తానని చెబుతూ మోసం చేశారని, ఆరోగ్యశ్రీని నీరుగార్చారని, ఇటువంటి సీఎం మీకు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. 

  • Loading...

More Telugu News