లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన అత్యంత పేద అభ్యర్థి ఇతడే!
- బ్యాంకు ఖాతాలో పైసా కూడా లేని లోక్సభ అభ్యర్థి
- కాకలు తీరిన యోధుల మధ్య బరిలోకి
- యూపీలోని ముజఫర్ నుంచి బరిలోకి న్యాయవాది
తాజా ఎన్నికల్లోనూ బరిలోకి దిగిన ఆయన నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ చర్చనీయాంశమైంది. తన వద్ద నగదు లేదని, బ్యాంకులో కూడా సొమ్ము లేదని పేర్కొన్నారు. తన భార్య వద్ద కూడా నగదు లేదని, ఆమె బ్యాంకు ఖాతాలోనూ సొమ్ము లేదని పేర్కొన్నాడు. అయితే, తమకు ఓ చిన్న ఫ్లాట్ ఉందని, రూ.15 లక్షల విలువల చేసే చిన్న ఇల్లు కూడా ఉందని పేర్కొన్నారు. అది కూడా తన స్వార్జితం కాదని, తన అత్తింటివారు బహుమానంగా ఇచ్చారని వివరించారు. అలాగే, 36 వేల విలువ చేసే బైక్ కూడా ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా, ప్రతీ ఎన్నికల సమయంలోనూ నాయకుల ఆస్తులు రెట్టింపు అవుతుండగా, కశ్యప్ మాత్రం మరింత పేదవాడిగా మారుతుండడం గమనార్హం.