Agrigold: అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ హఠాన్మరణం

  • సికింద్రాబాద్ లో మృతి
  • గుండెపోటుగా భావిస్తున్న బంధువులు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

రాష్ట్రంలో కొంతకాలంగా అగ్రిగోల్డ్ అంశం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే, అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాద్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్ వద్ద ఆయన గుండెపోటుతో మరణించినట్టు బంధువులు చెబుతున్నారు. పార్శిల్ కౌంటర్ వద్దకు రాగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారని, అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని బంధువుల కథనం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. సదాశివ వరప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదాశివ వరప్రసాద్ ఎంతో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ స్కాం నిందితుల్లో ఒకరిగా ఉన్నారు.

More Telugu News