nepal: నేపాల్ లో తుపాను బీభత్సం.. 25 మంది దుర్మరణం

  • 400 మందికి గాయాలు
  • విలవిల్లాడిన గ్రామాలు
  • గాలివానతో వణికిపోయిన ప్రజలు

హిమాలయ దేశం నేపాల్ లో ఆదివారం సాయంత్రం భీకర తుపాను విలయం సృష్టించింది. నేపాల్ దక్షిణభాగాన్ని తాకిన ఈ భారీ తుపాను కారణంగా 25 మంది మరణించగా, 400 మంది గాయాలపాలయ్యారు. పెనుగాలులకు వర్షం కూడా తోడవడంతో అనేక గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ముఖ్యంగా, బరా, పర్సా జిల్లాలు తుపాను తాకిడికి గురైనట్టు అధికారులు గుర్తించారు. ఈ రెండు జిల్లాల్లో ఎక్కడ చూసినా విలయం తాలూకు ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. తుపాను నష్టంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి విచారం వ్యక్తం చేశారు.

More Telugu News