Jagan: ఆడపడుచులకిచ్చే పసుపు - కుంకుమను కూడా జగన్ అవమానించడం సిగ్గుచేటు: కళా వెంకట్రావు

  • డ్వాక్రా సభ్యులను అప్పులపాలు చేశారు
  • మహిళలను టీడీపీ ఆడపడుచులుగా భావిస్తుంది
  • రాష్ట్రానికి దిక్సూచిగా మహిళా సంఘాలు

డ్వాక్రా సభ్యులను వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో అప్పులపాలు చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. నేడు ఆయన డ్వాక్రా మహిళలకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆడపడుచులకు ఇచ్చే పసుపు - కుంకుమను కూడా అవమానించడం సిగ్గుచేటన్నారు. మహిళలను ఆడపడుచులుగా భావించే ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. రాష్ట్రానికి దిక్సూచిగా మహిళా సంఘాలను మలచినట్టు కళా వెంకట్రావు పేర్కొన్నారు.

More Telugu News