Guntur District: ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అంటూ దొంగబాబు చెబుతున్న మాటలు నమ్మొద్దు: వైఎస్ షర్మిళ

  • బాబు ఇచ్చే ఎంగిలి మెతుకులకు మీరు మోసపోవద్దు
  • ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు
  • బాబు, మోదీ జోడి కలిసి ‘హోదా’ రాకుండా చేశారు

గుంటూరు జిల్లా పెదకూరపాడులో వైసీపీ ఎన్నికల ప్రచారంలో షర్మిళ మాట్లాడుతూ, ఐదేళ్లలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని, మరోసారి మోసం చేయాలని బాబు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చే ఎంగిలి మెతుకులకు మీరు మోసపోవద్దు పేదోడేమో ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్లాలట, బాబు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఏ ఆసుపత్రికి వెళ్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ పై విమర్శలు చేశారు.

ఏపీకి రావాల్సిన ప్రత్యేకహోదాను చంద్రబాబు, మోదీ జోడి కలిసి ఆ ‘హోదా’ రాకుండా చేశారని విమర్శించారు. మొదట ప్రత్యేక హోదా, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలన్న చంద్రబాబు, ఇప్పుడేమో మళ్లీ ‘హోదా’నే కావాలంటూ నాటకాలాడుతున్నారని, చంద్రబాబుది రోజుకో మాట, పూటకో వేషమని దుయ్యబట్టారు. ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అంటూ దొంగబాబు చెబుతున్న మాటలను నమ్మొద్దంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికలు పిల్లల భవిష్యత్ కు, ఏపీ అభివృద్ధికి చాలా కీలకమని, వైసీపీని గెలిపించి  రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని అన్నారు. 

  • Loading...

More Telugu News