బీజేపీలో చేరిన బీజేడీ సీనియర్ నేత సేథి!
- నవీన్ పట్నాయక్కు లేఖ రాసిన సేథి
- నా కుమారుడికి సీటు ఇవ్వాలని కోరాను
- ఇస్తానని హామీ ఇచ్చారు
- తుది జాబితాలో పేరు తొలగించారు
నవీన్ని కలుద్దామని వెళ్లి, ఆయన నివాసం వద్ద గంటల తరబడి నిరీక్షించానని, కానీ కొందరు నేతలు తనను అడ్డుకున్నారని వాపోయారు. బీజేడీకి ఇక తన అవసరం లేదని, వృద్ధాప్యంలో ఇది తనకో గట్టి షాక్ అని సేథి లేఖలో పేర్కొన్నారు. కాగా సేథి నేడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రథాన్ సమక్షంలో బీజేపీలో చేరారు.