keerthi suresh: షూటింగు దశలో కీర్తి సురేశ్ మూవీ .. దసరాకి రావడం ఖాయమట

  • నరేంద్ర దర్శకత్వంలో కీర్తి సురేశ్
  •  ప్రత్యేకమైన సెట్లో జరుగుతోన్న షూటింగ్
  • తదుపరి షెడ్యూల్ విదేశాల్లో    

'మహానటి' తరువాత కీర్తి సురేశ్ తెలుగులో నాయిక ప్రాధాన్యత కలిగిన మరో సినిమా చేస్తోంది. కథ అంతా కూడా ఆమె చుట్టూనే తిరుగుతుంది. నరేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, రాజేంద్రప్రసాద్ .. సీనియర్ నరేశ్ .. నదియా .. కమల్ కామరాజు .. భానుశ్రీ మెహతా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో .. 50 లక్షలతో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక్కడి షూటింగు పూర్తయిన తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమా టీమ్ విదేశాలకి వెళ్లనుంది. ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగు విదేశాల్లోనే జరుగుతుందట. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను, తెలుగుతోపాటు తమిళంలోను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News