Andhra Pradesh: తమ్ముళ్లూ.. సారీ.. వైసీపీ కార్యకర్తలను క్షమాపణ కోరిన జేసీ ప్రభాకర్ రెడ్డి!

  • అనంతపురంలోని పుట్లూరు మండలంలో ఘటన
  • వైసీపీ కార్యకర్తల బైక్ ను ఢీకొట్టిన జేసీ కారు
  • కార్యకర్తలను పరామర్శించి సారీ చెప్పిన జేసీ

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈ రోజు ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కొందరు వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన జిల్లాలోని పుట్లూరు మండలంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఎల్లుట్ల గ్రామం వద్దకు రాగానే ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ అటుగా వెళుతున్న వైసీపీ కార్యకర్తల బైక్ ను ఢీకొట్టింది. వెంటనే కారు దిగిన ప్రభాకర్ రెడ్డి వారి దగ్గరకు వేగంగా వెళ్లి పరామర్శించారు. డ్రైవర్ కారణంగా ఈ తప్పు జరిగిందనీ, క్షమించాలని కోరారు. వైసీపీ కార్యకర్తలకు పెద్దగా దెబ్బలేమీ తగలకపోవడంతో వారు బైక్ పై వెళ్లిపోయారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం కోసం ముందుకెళ్లారు.

More Telugu News