Chittoor District: చిత్తూరు జిల్లాలోని ఓ తోట నుంచి భారీగా మద్యం స్వాధీనం : తోట యజమాని వైసీపీ నేత

  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • 170 మద్యం కేసులు లభ్యం
  • విలువ రూ.6 లక్షల పైమాటే

చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ నేతకు చెందిన తోట నుంచి పోలీసులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. వి.కోట మండలం కుంభార్లపల్లెలోని మామిడి తోటలో మద్యం అక్రమ నిల్వలు ఉన్నాయన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 170 మద్యం కేసుల్లో 8,160 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా పంపిణీ చేసేందుకు వీటిని నిల్వ చేశారని భావిస్తున్నారు. మామిడితోట యజమాని శ్రీరాములురెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News