Telugudesam: ఈసారి టీడీపీకి 140 సీట్లు.. యరపతినేని జోస్యం

  • మురికి కూపంలా ఉండే పల్నాడును సుందర నగరంగా తీర్చిదిద్దాం
  • ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పండి
  • టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించండి

ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి మరోమారు అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లాలోని మాదినపాడు, తంగెడ, ముత్యాలంపాడు గ్రామాల్లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీ 140 సీట్లు గెలుచుకోవడం పక్కా అని జోస్యం చెప్పారు. టీడీపీ పాలనతో పల్నాడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. ఒకప్పుడు ఈ పట్టణం మురికి కూపంగా ఉండేదని, నేడు సుందర నగరంగా మారిందన్నారు. నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని, టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

More Telugu News