Jana Sena: జనసేన బహిరంగ సభలో తొక్కిసలాట.. ఆటోడ్రైవర్ దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
జనసేన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇవాళ పవన్ కల్యాణ్ పాల్గొన్న సభలో అనూహ్యరీతిలో భారీగా తొక్కిసలాట జరగడంతో ఓ ఆటోడ్రైవర్ ప్రాణాలు విడిచాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. మరణించిన వ్యక్తిని సిరాజ్ గా గుర్తించారు. అతడి వయసు 30 సంవత్సరాలు.

పవన్ కల్యాణ్ హాజరైన ఈ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సభకోసం ఏర్పాటు చేసిన స్పీకర్లకు ఉన్న ఇనుప రాడ్లు జారిపోవడంతో జనాల్లో తొక్కిసలాట ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒకరినొకరు తొక్కుకోవడంతో సిరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని నంద్యాల ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
Go Back to Shorts
Jana Sena
Pawan Kalyan

More Telugu News