Road Accident: గ్రేటర్ నోయిడా సమీపంలో ట్రక్కును ఢీకొట్టిన బస్సు...8 మంది మృతి

  • మరో 30 మందికి తీవ్రగాయాలు
  • 12 మంది పరిస్థితి విషమం
  • ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రయాణికులతో వస్తున్న డబుల్‌ డెక్కర్‌ బస్సు ఎదురుగా వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా మరో 30 మంది తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గ్రేటర్‌ నోయిడా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

యమునా ఎక్స్‌ప్రెస్‌ వేలో ఆగ్రా నుంచి గ్రేటర్ నోయిడాకు ఉదయం ఐదు గంటల సమయంలో ఈ బస్సు వెళ్తోంది. నోయిడా సమీపంలోని రబుపురా వద్దకు బస్సు వచ్చిన సమయంలో బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పింది. అదే మార్గంలో ఎదురుగా వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం దాదాపు సగం వరకు పూర్తిగా ధ్వంసం కావడంతో ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News