anu emmanuel: అందుకే వెనకబడ్డాను .. ఇకపై జాగ్రత్తగా వుంటాను: అనూ ఇమ్మాన్యుయేల్
- 'మజ్ను'తో తెలుగు తెరకు పరిచయం
- యూత్ లో పెరిగిన క్రేజ్
- వరుసగా పలకరించిన పరాజయాలు
తెలుగు తెరకి 'మజ్ను' సినిమా ద్వారా కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పరిచయమైంది. చక్కని కనుముక్కుతీరుతో ఈ సుందరి కుర్రాళ్లకు కుదురులేకుండా చేసింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోవడంతో, అల్లు అర్జున్ జోడీగా 'నా పేరు సూర్య' .. పవన్ సరసన 'అజ్ఞాతవాసి' .. చైతూతో 'శైలజా రెడ్డి అల్లుడు' చేసింది. ఈ సినిమాలన్నీ వరుసగా పరాజయంపాలు కావడంతో, సహజంగానే అనూ ఇమ్మాన్యుయేల్ కి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
తాజాగా ఆమె మాట్లాడుతూ .."కెరియర్ తొలినాళ్లలో వరుసగా గ్లామరస్ పాత్రలను చేస్తూ వెళ్లాను. అదే సమయంలో నాకు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలను చేశాను. ఈ కారణంగానే నేను వెనకబడిపోయాను. ఇకపై కథల విషయంలో .. నా పాత్రల విషయంలో జాగ్రత్తగా వుంటాను. గ్లామర్ తోపాటు నటనకి అవకాశం వుండే ప్రాధాన్యత గల పాత్రలను మాత్రమే చేస్తాను" అని చెప్పుకొచ్చింది.
తాజాగా ఆమె మాట్లాడుతూ .."కెరియర్ తొలినాళ్లలో వరుసగా గ్లామరస్ పాత్రలను చేస్తూ వెళ్లాను. అదే సమయంలో నాకు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలను చేశాను. ఈ కారణంగానే నేను వెనకబడిపోయాను. ఇకపై కథల విషయంలో .. నా పాత్రల విషయంలో జాగ్రత్తగా వుంటాను. గ్లామర్ తోపాటు నటనకి అవకాశం వుండే ప్రాధాన్యత గల పాత్రలను మాత్రమే చేస్తాను" అని చెప్పుకొచ్చింది.