కర్ణాటకలో మంత్రి రేవణ్ణ, కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు!
- మంత్రి రేవణ్ణ ఇల్లు, కార్యాలయంలో సోదాలు
- తీవ్రంగా మండిపడ్డ ముఖ్యమంత్రి కుమారస్వామి
- మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శ
మరోవైపు ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తమను బెదిరించడానికే ప్రధాని మోదీ ఇలాంటి ప్రతీకార చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఐటీ అధికారి బాలకృష్ణ ఆయనకు సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. జేడీఎస్, కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు చేయిస్తూ మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఐటీ దాడులు జరగొచ్చని కుమారస్వామి వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఆదాయపు పన్ను శాఖ కర్ణాటకలో సోదాలు నిర్వహించడం గమనార్హం.