Anantapur District: బాబు రోడ్డు షో సందర్భంగా కూలిన గోడ...పలువురికి గాయాలు

  • అనంతపురం సప్తగిరి సర్కిల్‌ వద్ద ప్రమాదం
  • కూలిన మసీదు కాంప్లెక్స్‌ వరండా పైభాగం
  • కింద నిల్చున్న వారికి గాయాలు

అనంతపురం జిల్లా కేంద్రంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం సందర్భంగా స్వల్ప  ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాత కట్టడం వరండా పైకప్పు కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. నిన్నరాత్రి పట్టణంలోని సప్తగిరి సర్కిల్‌లో సీఎం ప్రచార సభ జరిగింది. ఈ సభకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. సమీపంలోని మసీదు కాంప్లెక్స్‌ వరండాలో చాలామంది నిల్చుని చంద్రబాబు ప్రసంగాన్ని వింటున్నారు. అదే సమయంలో ఈ వరండా పైభాగం ఒక్కసారిగా కుప్పకూలి కింద నిల్చున్న వారిపై పడింది. దీంతో పలువురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను సర్వజన ఆసుపత్రికి తరలించారు. పాత భవనం కావడంతో కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

More Telugu News