కాంగ్రెస్ కనీస ఆదాయ పథకంపై విరుచుకుపడిన మాయావతి .. బీజేపీ ఆరోపణలు నిజమేనన్న బీఎస్పీ చీఫ్!
- తాము అధికారంలోకి వస్తే పేదలకు ఏడాదికి రూ.72 వేలు ఇస్తామన్న రాహుల్
- బీజేపీ ఆరోపణలు సమర్థిస్తూనే కాంగ్రెస్పై మాయా మండిపాటు
- అబద్ధపు హామీలు ఇవ్వడంలో దొందూదొందేని విమర్శ
తాము అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయ పథకాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటించారు. పేదరికంపై సర్జికల్ స్ట్రయిక్గా దీనిని అభివర్ణించిన రాహుల్.. పేదలకు ఏడాదికి రూ.72 వేలు చొప్పున ఇస్తామని పేర్కొన్నారు. ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై ఆర్థికవేత్తలతో చర్చించిన మీదటే దీనిని ప్రకటించినట్టు రాహుల్ తెలిపారు.