Mahesh Babu: 'మహర్షి' నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్ కి టైమ్ ఫిక్స్

  • వంశీ పైడిపల్లి నుంచి 'మహర్షి'
  • ఈ నెల 29న ఫస్టు సింగిల్ 
  • మే 9వ తేదీన సినిమా విడుదల  

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రను అల్లరి నరేశ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణను చాలావరకూ పూర్తి చేశారు. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెల 29న ఉదయం 9 గంటల 9 నిమిషాలకి ఫస్టు సింగిల్ గా 'చోటి .. చోటి' అంటూ సాగే సాంగ్ ను వదలనున్నారు. ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీ యూత్ ను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. మహేశ్ బాబు .. 'అల్లరి' నరేశ్ .. పూజా హెగ్డేలపై ఈ పాటను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. మొదటి సాంగ్ తో ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు పెరుగుతాయో చూడాలి మరి.

More Telugu News