Redmi Go: రూ. 4,499కి రెడ్ మీ గో... రూ. 2,200 క్యాష్ బ్యాక్... నేడు ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేక అమ్మకాలు!

  • అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ రెడ్ మీ గో
  • మధ్యాహ్నం 2 గంటలకు అమ్మకాలు
  • క్యాష్ బ్యాక్ అందిస్తున్న జియో

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ, అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ 'రెడ్ మీ గో'ను నేటి నుంచి అందుబాటులోకి తేనుంది. కేవలం రూ. 4,499 ధరతో ఫ్లిప్ కార్ట్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. గతవారంలో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ విజయవంతంకాగా, నేడు మరో దఫా అమ్మకాలను ఫ్లిప్ కార్ట్ ద్వారా షియోమీ చేపట్టనుంది.

కాగా, ఈ ఫోన్ కొన్న వారికి జియో నుంచి రూ. 2,200 క్యాష్ బ్యాక్ లభించడం అదనపు లాభం. ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, 5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, క్వాల్‌ కామ్ స్నాప్‌ డ్రాగన్ 425 చిప్‌ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఒరియో ఆపరేటింగ్ సిస్టమ్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌, 8/5 ఎంపీ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.

More Telugu News