Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంజయ్ దత్, వరుణ్ ధావన్!

  • తారక్, చెర్రీ ప్రధాన పాత్రల్లో ‘ఆర్ఆర్ఆర్’
  • కీలక పాత్రలో అజయ్ దేవగణ్
  • కథానాయికలుగా ఆలియా, డైసీ ఎడ్గర్ జోన్స్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకుంటున్నట్టు ఇటీవల రాజమౌళి ప్రెస్‌మీట్‌లో తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి చెప్పినట్టుగానే ఇప్పటికే ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అజయ్‌ దేవగణ్‌ను ఎంచుకున్నారు.

ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్‌లను కథానాయికలుగా ఎంచుకున్నారు. ప్రస్తుతం మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్‌ని ఎంచుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్, వరుణ్ ధావన్‌లు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమా దర్శక, నిర్మాతలు సంజయ్, వరుణ్‌ను సంప్రదించగా వారు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది.

More Telugu News