YSRCP: వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. జగన్ ఎదుటే ఫ్లెక్సీలు చింపి హంగామా సృష్టించిన నేతలు

  • భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు
  • పోలీసుల లాఠీచార్జి
  • సీనియర్ నేత మత్యరాస బాలరాజుకు గాయాలు

వైసీపీ అధినేత జగన్‌కు విశాఖ జిల్లా పాడేరులో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ముందే ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు చింపేసి హంగామా సృష్టించారు. జగన్ సభ జరుగుతుండగానే ఆ పార్టీ సమన్వయకర్త మత్యరాస విశ్వేశ్వరరాజు అనుచరులు, పాడేరు అభ్యర్థి భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు.

దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత మత్యరాస బాలరాజు గాయాలపాలవడంతో ఒక్కసారిగా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. మరో కీలక నేత జి.మాడుగుల ఎంపీపీ మత్యకొండం నాయుడు కూడా భాగ్యలక్ష్మిని ఓడిస్తామని ప్రకటించారు.  

More Telugu News