gorantal madhav: నిర్ణయం మార్చుకున్న గోరంట్ల మాధవ్.. భార్యను బరిలోకి దింపేందుకు సిద్ధం

  • ట్రైబ్యునల్ ఆదేశించినా రాజీనామాను ఆమోదించని ప్రభుత్వం
  • తన భార్యకు టికెట్ ఇవ్వాలంటూ జగన్ ను కోరిన మాధవ్
  • సవితకు బీఫామ్ ఇవ్వాలంటూ జగన్ ఆదేశం

హిందూపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ కు పరిస్థితులు అనుకూలంగా మారలేదు. తన వీఆర్ దరఖాస్తును ఆమోదించాలని ట్రైబ్యునల్ ఆదేశించినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, నామినేషన్లకు తుది గడువు ముంచుకొస్తుండటంతో... తన భార్య సవితను రంగంలోకి దించాలని భావించారు.

ఈ నేపథ్యంలో, ఈ ఉదయం పార్టీ అధినేత జగన్ తో మాధవ్ భేటీ అయ్యారు. తన రాజీనామాను ఆమోదించకపోతే తన భార్యతో నామినేషన్ వేయిస్తానని ఈ సందర్భంగా జగన్ కు చెప్పారు. దీంతో, మాధవ్ భార్య సవితకు బీఫామ్ ఇవ్వాలంటూ పార్టీ నేతలను జగన్ ఆదేశించారు.

More Telugu News