Andhra Pradesh: మంగళగిరిలో నామినేషన్ వేసిన నారా లోకేశ్

  • తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్  సమర్పణ
  • భారీ సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు
  • లోకేశ్ వెంట ఉన్న తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత నారా లోకేశ్ ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరిలోని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను లోకేశ్ సమర్పించారు. లోకేశ్ వెంట టీడీపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. లోకేశ్ తో ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ ఉన్నారు.  

More Telugu News