East Godavari District: టీడీపీకి హర్షకుమార్ గుడ్ బై.. టీడీపీ-జనసేన ఒకటేనని విమర్శ!

  • ఇటీవలే టీడీపీలో చేరిన హర్షకుమార్
  • జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ టికెట్లను  టీడీపీ ఫిక్స్ చేస్తోంది
  • టీడీపీతో పొత్తు లేదని పవన్ ప్రమాణం చేయాలి

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఇటీవలే టీడీపీలో చేరారు. టీడీపీలో చేరి పట్టుమని పది రోజులు కూడా కాకముందే, ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు ఆయన ప్రకటించారు. అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి తనకు సీటు దక్కుతుందని భావించిన హర్షకుమార్ కు చుక్కెదరు అవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో హర్షకుమార్ మాట్లాడుతూ, టీడీపీ, జనసేన పార్టీలు రెండూ ఒక్కటేనని విమర్శించారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే టీడీపీతో పొత్తు లేదని దేవుడిపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ టికెట్లను టీడీపీ ఫిక్స్ చేస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News