ka paul: తొలి అభ్యర్థిని పులివెందుల నుంచి ప్రకటిస్తా... జగన్ ను ఓడించాల్సిందే!: కేఏ పాల్

  • ఫ్యాన్ కు, హెలికాప్టర్ కు తేడా తెలియని జగన్ సీఎం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి
  • తుప్పుపట్టిన ఫ్యాన్, సైకిల్, పగిలిపోయే గ్లాసుకు ఓటు వేయవద్దు
  • తొలి అభ్యర్థిని పులివెందుల నుంచి ప్రకటిస్తా

తమ హెలికాప్టర్ గుర్తును రద్దు చేయాలని వైసీపీ అధినేత జగన్ ఈసీకి ఫిర్యాదు చేశారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. హెలికాప్టర్ కు, ఫ్యాన్ కు ఏమైనా పోలిక ఉంటుందా? అని ప్రశ్నించారు. హెలికాప్టర్ కు, ఫ్యాన్ కు తేడా కూడా తెలియని జగన్ సీఎం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని ఎద్దేవా చేశారు. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నానని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనుండటంతో అందిరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు.

 తుప్పుపట్టిన ఫ్యాన్, తుప్పుపట్టిన సైకిల్, పగిలిపోయే గ్లాసు గుర్తులకు ఓటు వేయవద్దని... ఈ ముగ్గురూ ప్రస్తుతం తిరుగుతున్న హెలికాప్టర్ కే ఓటు వేయాలని కోరారు. అధికారంలోకి వస్తే ఏడాదిలో ఏపీని అమెరికా చేస్తానని చెప్పారు. తమ పార్టీలో అన్ని కులాలకు టికెట్లు ఇస్తున్నామని తెలిపారు. తొలి అభ్యర్థిని పులివెందుల నుంచి ప్రకటిస్తానని, జగన్ ను ఓడించాలని అన్నారు. తమ మేనిఫెస్టో చూడాలని, అప్పుడు ఓటు వేయాలని చెప్పారు.

More Telugu News