Andhra Pradesh: ఈ డ్రామాకు జగన్ కుటుంబ సభ్యులే ఆర్టిస్టులు: టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి

  • వివేకా హత్య వ్యవహారం డ్రామాలా నడిచింది
  • జగన్, అవినాష్ రెడ్డి డైరెక్షన్ లో ఈ డ్రామా జరిగింది
  • టీడీపీ హస్తం ఉందని తేల్చితే ఏ శిక్షకైనా సిద్ధమే

వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం డ్రామాలా నడిచిందని, ఈ డ్రామాకు జగన్ కుటుంబ సభ్యులే ఆర్టిస్టులని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్, అవినాష్ రెడ్డి డైరెక్షన్ లో డ్రామా జరిగిందని వివేకాది హత్య అని తెలిసినా రాజకీయ డ్రామాలాడారని విమర్శించారు. చంద్రబాబుపైన, తనపైనా నిందలు వేశారని, వివేకా హత్యలో టీడీపీ హస్తం ఉందని తేల్చితే ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.

More Telugu News