'చిత్రలహరి' నుంచి ఫస్టు లిరికల్ వీడియో సాంగ్
- ప్రేమకథా చిత్రంగా 'చిత్రలహరి'
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
కిషోర్ తిరుమల దర్శకత్వంలో .. సాయిధరమ్ తేజ్ హీరోగా 'చిత్రలహరి' నిర్మితమైంది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "పరుగు పరుగు వెళుతున్నా ఎటు వైపు .. జరుగు జరుగు అంటుంది లైఫు. ఎంత పెంచుకుంటున్నా నా వేగం .. నన్ను దాటిపోతుందే లోకం" అంటూ డేవిడ్ సైమన్ పాడిన ఈ పాట సాగుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ పాటను ఆయనే రాయడం విశేషం. మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, కల్యాణి ప్రియదర్శిని .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది
దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ పాటను ఆయనే రాయడం విశేషం. మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, కల్యాణి ప్రియదర్శిని .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది