loksabha: లోక్ సభ ఎన్నికల్లో టీ-కాంగ్రెస్ కు మద్దతుపై రెండ్రోజుల్లో ప్రకటిస్తాం: చాడ వెంకటరెడ్డి

  • టీ-కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు
  • తెలంగాణలో రాజకీయాలు భ్రష్టుపట్టాయి
  • రాజకీయ విలువలకు పాతరేశారు

లోక్ సభ ఎన్నికల్లో టీ-కాంగ్రెస్ కు తమ పార్టీ మద్దతు విషయమై రెండ్రోజుల్లో ప్రకటిస్తామని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐను టీ-కాంగ్రెస్ కోరింది. ఈ నేపథ్యంలో చాడ వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, టీ-కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి తనను కోరారని చెప్పారు. తెలంగాణలో రాజకీయాలు భ్రష్టుపట్టాయని, కేసీఆర్ సీఎం అయ్యాక రాజకీయ విలువలకు పాతరేశారని, దళిత, మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

More Telugu News