Andhra Pradesh: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు.. జగన్ ఫ్యామిలీని విచారించనున్న సిట్ అధికారులు!

  • ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలపై చర్చ
  • కాల్ డేటాపై దృష్టి పెట్టిన పోలీసులు
  • ఇప్పటికే 10 మంది నిందితులు అదుపులోకి

వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే వివేకానందరెడ్డి డ్రైవర్ సహా 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సిట్ అధికారులు జగన్ కుటుంబ సభ్యులు, బంధువులను విచారించనున్నారు.

ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం ఆర్థిక లావాదేవీలు, కుటుంబంలో గొడవలు, కాల్ డేటాపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఘటనాస్థలంలో దొరికిన లేఖను సిట్ అధికారులు పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు.

More Telugu News