janasena: జనసేన- బీఎస్పీ చర్చలు సఫలం

  • ఎంపీ విర్‌ సింగ్, ఏపీ బీఎస్పీ నాయకులతో సమావేశం
  • ఏపీలో బీఎస్పీ పోటీ చేసే స్థానాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ
  • చర్చల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్

జనసేన, బహుజన సమాజ్ పార్టీ చర్చలు సఫలమయ్యాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలసి బహుజన సమాజ్ పార్టీ మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ విర్‌ సింగ్, ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ నాయకులతో ఈ రోజు చర్చించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఏపీలో బీఎస్పీ పోటీ చేసే స్థానాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగినట్టు సమాచారం.

More Telugu News