Tippareddy: టీడీపీలో చేరనున్న మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే

  • టికెట్ నిరాకరించిన వైసీపీ
  • మనస్తాపం చెందిన తిప్పారెడ్డి
  • బలమైన అభ్యర్థి లేకపోవడం కలిసొచ్చే అంశం

మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ కండువా కప్పుకోనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మదనపల్లిలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడం తిప్పారెడ్డికి కలిసొచ్చే అంశంగా పరిణమించింది. దీంతో ఆయనకు టీడీపీ నుంచి టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీని ప్రారంభించినప్పటి నుంచి తిప్పారెడ్డి ఆ పార్టీతో ఉన్నారు. ఆ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆయన.. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

  • Loading...

More Telugu News