Telangana: ఐస్ తింటుండగా బయటపడ్డ బల్లి.. పోలీసులకు ఫిర్యాదు!

  • కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఘటన
  • తోపుడు బండి వద్ద ఐస్ కొన్న శ్రీకాంత్
  • పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

వేసవి తాపానికి తాళలేక మనలో చాలామంది శీతల పానీయాలు తాగితే, మరికొంతమంది ఐస్ క్రీములను ఆశ్రయిస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో ఐస్, ఐస్ క్రీమ్ ల తయారీదారులు నాణ్యత పాటించకుండానే వాటిని వినియోగదారులకు అంటగడుతూ ఉంటారు. తాజాగా ఈ తరహా ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఓ తోపుడు బండి వద్ద ఐస్ కొన్నాడు. అనంతరం దాన్ని తింటుండగా నోటికి ఏదో తగిలినట్లు అనిపించింది. ఏంటా.. అని చూసేసరికి ఐస్ లో చచ్చిన బల్లి కనిపించింది. దీంతో ఒక్కసారిగా వాంతులు చేసుకున్న బాధితుడు ఆసుపత్రిలో చేరాడు.

ఈ విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఐస్ తయారీదారులపై కేసు నమోదు చేయాలని బాధితుడు శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించాడు.

More Telugu News