అభ్యర్థుల జాబితా విడుదల వాయిదాపై క్లారిటీ ఇచ్చిన జగన్
- పార్టీ ముఖ్యనాయకులతో ఈరోజు సమావేశం
- పార్టీలో చేరబోయే వారింకా ఉన్నారని వెల్లడి
- అందుకే జాబితా పెండింగ్లో పెట్టినట్లు వివరణ
ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయని, ఇంకా పార్టీలోకి వచ్చే వారు ఉన్నారని వివరించారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే జాబితాను చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వచ్చిందని నాయకులకు వివరించి చెప్పినట్లు సమాచారం. ఇంకా కొన్ని నియోజకవర్గాలపై కసరత్తు పూర్తికాలేదని, అన్ని అంశాలను పూర్తిచేసి ఈనెల 16వ తేదీన జాబితా విడుదల చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలిసింది.