Sabitha Indrareddy: ముగిసిన కేసీఆర్ - సబిత భేటీ.. కారెక్కెందుకు లైన్ క్లియర్!

  • స్నేహపూర్వకంగానే కలిశాం
  • మేము అడగాల్సినవి అడిగాం
  • కేసీఆర్ చెప్పాల్సినవి చెప్పారు

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ ముగిసింది. తన ముగ్గురు కుమారులతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లిన సబిత.. కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. తాము అడగాల్సినవి అడగ్గా.. ఆయన చెప్పాల్సినవి చెప్పారని.. చేవెళ్లలో జరగబోయే భారీ బహిరంగ సభలో తాము టీఆర్‌ఎస్‌లో చేరుతామని తెలిపారు. అయితే ఈ భేటీలో సబిత.. తన కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ స్థానం, అలాగే తనకు మంత్రి పదవి కోరినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఎంపీ స్థానం ఇచ్చేందుకు అంగీకరించాని తెలుస్తోంది.

More Telugu News