janasena: 32 అసెంబ్లీ, 9 లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేసిన పవన్ కల్యాణ్

  • ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన పవన్
  • జనరల్ బాడీ సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేశామన్న జనసేనాని
  • దూకుడు పెంచుతున్న జనసేన

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే జనసేన దూకుడు పెంచింది. ఈ రోజు ఏకంగా 32 అసెంబ్లీ స్థానాలు, 9 లోక్ సభ స్థానాలకు జనసేనాని పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ జనరల్ బాడీ సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేశామని ఈ సందర్భంగా పవన్ ట్వీట్ చేశారు. నిజాయతీ, నిబద్ధత కలిగిన వ్యక్తులకు టికెట్లను ఇస్తున్నామని చెప్పారు. ఎవరెవరికి టికెట్లు వచ్చాయో కాసేపట్లో పార్టీ నుంచి ప్రకటన వెలువడనుంది.

More Telugu News